ట్యాగులు
నాకు లభించిన చివరి వ్యాసం అందిస్తున్నాను. Prabuddha Andhra_1939_06_01_నైజాం-4
15 మంగళవారం మార్చి 2016
Posted పాత పత్రికలు, శ్రీపాద, Uncategorized
inట్యాగులు
నాకు లభించిన చివరి వ్యాసం అందిస్తున్నాను. Prabuddha Andhra_1939_06_01_నైజాం-4
11 శుక్రవారం మార్చి 2016
Posted Uncategorized
in1935 ఆగస్టు ప్రబుద్ధాంధ్రలో వచ్చిన ఈ వ్యాసం చదవమని కోరుతూPrabuddha Andhra_1935_08_అనుకరణము
09 బుధవారం మార్చి 2016
Posted పాత పత్రికలు, వివిన కబుర్లు, శ్రీపాద
inగాంధీగారి కాంగ్రెస్సు స్వతంత్రానికి ముందు ప్రచారం చేసిన కార్యక్రమాలలో- అస్పృశ్యుల దేవాలయ ప్రవేశం- ఒకటి. అంతకుముందే గురజాడ, బంకుపల్లి మల్లయ్యశాస్త్రి వంటి ఇంకా ఎందరో సంస్కరణ వాదులు మానవతా దృక్పధంతో అస్వృసేయ సమస్యపట్ల స్వందించారు. ఇంకా వెనక్కి వెళ్తే రామానుజుడూ, వీరశైవులూ ఈ అమానవీయ కట్టుబాట్లపై స్పందించారు. ఉద్యమాలు నడిపారు. గాంధి గారి -అస్పృశ్యుల దేవాలయ ప్రవేశం పుట్టుక, పరిణామం పరిశీలించగలవారికి దానిలో ఉండే రాజకీయాలు కూడా అందుతాయి.. 75 ఏళ్ల క్రితం దానిపై శ్రీపాద వేసిన ప్రశ్నలు- స్వతంత్రోద్యమం ఉరవడిలో, కాంగ్రెస్సు ప్రచారంలో- ఒక పక్కకు ఉండిపోయాయి. ఈనాడు మతం పేరుపెట్టుకున్న రాజకీయపక్షం పాలనలో ఉన్నాం మనం. నిజంగా వారికి మతం కావాలో, పాలనాధికారం కావాలో, అందులో దేనికోసం ఏదికావాలో తెలీని స్థితిలో ఆలోచనాపరులున్నారు. మతాన్ని ఒకలా వాడుకున్న గాంధి కాంగ్రెస్సు ఈనాడున్న కాంగ్రెస్సూ ఒకటేనా? ఆనాటి హిందూ మహాసభ ఈనాటి భాజపా ఒకటేనా? ఆనాడు ఒక నిజాయితీగల ఆలోచనాపరుడు వేసిన ప్రశ్నలు ఎలా మరుగున పడిపోయాయో ఈనాడూ వర్తమాన సంబంధిత ప్రశ్నలూ ప్రశ్నలూ మరుగున పడిపోతున్నాయా? ఈ ప్రశ్నలతో ఈవ్యాసం చదవండి.. నేడు వివేచన ఆవశ్యకతని గుర్తించండి. అందుకు ఈ ప్రశ్నలు – ఇలాంటి ప్రశ్నలు వెయ్యగల సత్తా కోసం- ఆలోచించండని కోరుతూ..Prabuddha Andhra_1939_08_దేవాలయప్రవేశం
08 మంగళవారం మార్చి 2016
Posted పాత పత్రికలు, శ్రీపాద
inట్యాగులు
లోగడ 2వ్యాసాలు నైజాం రాష్ట్రంపై శ్రీపాద రాసినవి అందించాను. ఇది వాటిలో మూడవది.
03 గురువారం మార్చి 2016
Posted పాత పత్రికలు, శ్రీపాద
inనేనిప్పుడు శ్రీపాద పుస్తకం పనిలో పూర్తిగా మునిగిపోయివున్నాను. ఆరువేల పుటల పైగా మేం సేకరించగలిగిన శ్రీపాద రచనలని ఇంత క్షుణ్ణంగా చదివే అవకాశం నా 68వ ఏట నైనా నాకు లభించింది. ఆయన ఆత్మకథ, కథలు, నవలలు తప్ప ఆయన వ్యాసాలు నేను చదవలేదు. సామాజిక విషయాలపై ఆయన అభిప్రాయాలతో నాకు కొంత అనంగీకారం ఉన్నా ఆయన హేతుబద్ధత, తార్కికత అన్నింటికీ మించిని నజాయితీ, నిర్భీకత అవగతం అవుతున్న కొద్దీ, నా ఆలోచనలకు పదును పెడుతున్నకొద్దీ నాకు కొన్ని ప్రశ్నలు కలుగుతున్నాయి. ఆయన సమకాలీన ప్రసిద్ధ రచయితలను స్వంతం చేసుకున్నట్టు – జాతి, ఆంధ్రజాతి, తెలుగు జాతి అంటూ వారిని ఏకం చెయ్యటానికీ, ఒక జాతి అన్న భావన కలిగించటానికీ జీవితాంతమూ యావచ్ఛక్తులూ వినియోగించిన శ్రీపాదను – ఎందుకు స్వంతం చేసుకోలేదు? ఈనాటి సమాజంలో, సాహిత్యంలో తాను నమ్మినదానిని ఇంత నిజాయితీగా చెప్పేవారున్నారా? కథల మాటున, కవితల మాటున మనసులోని భావాలు చెప్పుకోటానికి కూడా సాటిజనమే కత్తులు పట్టుకు కళ్లెగరేస్తున్నపుడు ప్రజాస్వామిక చర్చకి అవకాశం ఈసమాజంలో లభిస్తుందా? మద్యపానంపై వారి ఈ వ్యాసాన్ని చదవండి. శ్రీపాద వస్తునిష్టకి ఇది ఒక మచ్చు .
నేనిలా శ్రీపాద రచనలు అందివ్వటం బోరుగా ఉందా?
02 బుధవారం మార్చి 2016
Posted పాత పత్రికలు, శ్రీపాద
inమన దేశ పరిణామంలో పుట్టి, మందు కనిపించకండా, వున్న వ్యాధి కుల వ్యవస్థ. దానికి శిఖరాయమానమైన జాడ్యం అస్వృస్యత. దానికి గురయిన మేథావీ, విద్యావేత్త, పండితుడు అంబేద్కరు అన్న ప్రసిద్ధ వాక్యం నేను హిందువుగా చనిపోను. దానిపై 1935నవంబరు ప్రబుద్ధాంధ్ర మైసపత్రికలో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి రాసిన వ్యాఖ్యానం ఈనాడు మనం చదవాలని నా కోరిక. నాలిక చివరి మాటలు
01 మంగళవారం మార్చి 2016
Posted పాత పత్రికలు, శ్రీపాద, Uncategorized
inభావకవిత్వం ఎచ్చుగా వున్న రోజులలో ఈరకం ప్రశ్నకి కవులు చెప్పిన జవాబు పాఠకులు అర్ధం చేసుకోవాలన., అలా అర్ధం చేసుకునే శక్తి సంపాదించుకోవాలన్న సూచన, ఆశ కూడా ఇందులో గర్భితమై ఉన్నాయి. నేటి కవులు(కొందరు కథకులు కూడా) ఈ ప్రశ్నకి ఏం జవాబు ఇస్తారు? చర్చని కోరుతూ శ్రీపాద వారి వ్యాసాన్ని అందిస్తున్నాను.kaviulu -Prabuddha Andhra_1935_07