• About

వివిన మూర్తి వెదుకులాట

~ సాహిత్యమూ జీవితమే

వివిన మూర్తి వెదుకులాట

Category Archives: వివిన కబుర్లు

మంజీరతో నా సంబంధం వారి కథలు 1

11 ఆదివారం మార్చి 2018

Posted by వివిన మూర్తి in ఇతరుల కథలు, వివిన కబుర్లు

≈ వ్యాఖ్యానించండి

మంజీర కలంపేరుతో 1958-59లలో భారతి, ఆంధ్రపత్రికలలో పది కథలు రాసారు ఎమ్జీ రావు అనే ఆయన. వీరి పూర్తిపేరు మంచికంటి గున్నారావు. వీరు మధ్యప్రదేశ్ నైన్పూర్లో రైల్వేలో పనిచేస్తుండే కాలంలో పురాణం సుబ్రహ్మణ్యశర్మ వీరికి మిత్రుడు. వీరితో మూడవ మిత్రుడు ఆర్.ఎమ్. రావు గారు. మృత్యంజయరావు గారని గుర్తు. పురాణం తమ ముగ్గురి మీద ఒక నవల రాసారు. వీరు అక్కడ నుంచి జ్వాల అనే పేరిట ఓ కథాసంకలనం 1956లో తీసుకువచ్చారు. 1926లో పుట్టిన గున్నారావు గారు రెండురోజుల క్రితం 92వ ఏట మరణించారు. వీరు మా నాన్నగారికి మేనమామ కొడుకు. 1967లో ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాదు చేరినపుడు నాకు ఆశ్రయం ఇచ్చారు. ఉద్యోగం రాలేదు గాని నా జీవితంలోకి కమ్యూనిజం వచ్చింది. 65లో రైల్వే జనరల్ స్ట్రైక్ జరిగినపుడు మంజీర కమ్యటనిస్టుగా ట్రేడ్ యూనియన్ కార్యకలాపంలో జైలులో ఉంచారని గుర్తు. శిక్షగా గార్డు నుంచి క్లర్కుగా డిప్రమోట్ చేసారు. వారి ద్వారానే నాకు కమ్యూనిజంతో పరిచయం జరిగింది. మొదటి సంవత్సరం వరకూ కమ్యూనిజం అనేది ఒక ప్రకృతి విరుద్ధమైన ఆదర్శంగా ఆయనతో వాదించేవాడిని. భావించేవాడిని. అసమానత అనేది ప్రకృతి సహజమైనదనేవాడిని. తరవాత ఆయన కాపిటల్ గురించి చెప్పి చదవమన్నారు. అయిదువేళ్లూ ఒకటి కావనే వాదన ఆరోజులలో చాలామంది వాడేవారు. క్రమంగా నేను నా వ్యక్తిగత జీవితంలో ఆకలి, నిరుద్యోగం, పేదరికం వల్ల కలిగే అవమానాలు అనుభవించుతూ కమ్యూనిజం వైపు ఆకర్షితుడయాను. పునాది -ఉపరితలం అవగాహన నా బౌద్ధిక జీవితానికి ఈనాటి వరకూ ఆలంబనగా ఉంది. దీనికి తొలి గురువు మంజీర గారు. సమాజ పరివర్తనలో లేదా పెనుమార్పులో సాహిత్యం యెక్క పాత్ర పట్ల చిన్నచూపు నా స్వంతమేగాని వీరికి దానిపట్ల కొంత గురి ఉండేది. ఆంగ్ల సాహిత్యం బాగా చదువుకున్న రావు గారు నవల అనేది ఎలా ఉంటుందో చెప్పాలన్న ఆలోచనతో సుమారు 5వేల పేజీల నవల మహాయానం రాసారు. దానిని ముద్రించాలన్న ఆశ తీరలేదు. కథానవీన్ తరవాత మనసు రాయుడు గారి వంటి వారిద్వారా నా సిగ్గుబిడియాలు విడిచి కొంత ప్రయత్నం చేసాను. ఫలించలేదు. ఎవరినీ ఏనాడూ ఏదీ అభ్యర్థించరాదన్న  వెర్రి నియమం నాది. సాహిత్యమే ఒక పనికిమాలిన వ్యవహారం.. దానికోసం ఆత్మాభిమానం చంపుకోవటంగా అనిపించుతుంది. ఈజాడ్యం నాకు చాలా చిన్నితనంలో పట్టింది. దీనివల్లనే నేనూ నా సాహిత్యం కూడా మహాయానంలాగే తొందరగా కాలగర్భంలో కలిసిపోటం తప్పదు.

పోతే రావుగారు నాచేత చాలా పుస్తకాలు చదివించారు. అందులో కురుగంటి సీతారామయ్య గారి నవ్యాంధ్ర సాహితీవీధులు బాగా గుర్తు.(పేర్లు తప్పు కావచ్చు.) డోస్టోవిస్కీ నేరమూ శిక్ష నా జీవితాన్ని ప్రభావితం చేసిన మొదటి పుస్తకం వారే నాకు ఇచ్చారు. సాంప్రదాయం అలవాటు అనేవాటి సంబంధం గురించి వారి వివరణ నా ఆలోచనలలో కలకాలం నిలిచినది. అలాగే ఫలానీది చదవరాదనేది తప్పు. చదివి నీ అభిప్రాయం నువ్వు ఏర్పరచుకోవాలన్నది వారి నుంచే నేను నేర్చాను. కమ్యూనిస్టులు అలాంటి నిషిధ్దాలు చెయ్యటం వారికి నచ్చేది కాదు. ప్రభుత్వం ఆపని చెయ్యరాదనేవారు తాము ఆపని ఎందుకు చేస్తారనేది వారి ఆలోచన. సెక్సుతో సహా ప్రతిదీ చదివి అభిప్రాయం ఏర్పరచుకోవాలనీ పేరుచూసి నిర్ణయించుకోరాదనీ దానిపై అభిప్రాయం చెప్పరాదనీ  నా 19వ ఏట ఆయన చెప్పిన విషయం నాకు ఇప్పటికీ అనుసరణీయమే. ఆ తర్వాత దరిశ చెంచయ్య గారి నేనూ నా దేశం నన్ను పూర్తిగా తీర్చిదిద్దిన పుస్తకం. ఇది మంజీర గారు ఇవ్వలేదనే గుర్తు. వారితో నేను నా ఫార్మేషన్ దశలో తప్ప ఎక్కువగా గడపింది లేదు. విశాలాంధ్ర వారు వందేళ్ల తెలుగుకథలో వారి కథ చేర్చటం నాకు ఆనందం కలిగించింది. అది నా రికమండేషనా అని ఫోన్ చేసారు. మావయ్య గారూ నాకే సంబంధం లేదు అని చెప్పాను. ఒక్క కూతురు లండన్లో ఉంటోంది. చివరిరోజులలో నర్సమ్మూర్తీ ఓమారు రావోయ్ అని ఆరునెలల క్రితం ఫోన్ చేసారు. వెళ్లలేకపోయాను. పనిగట్టుకుని చెయ్యవలసినవెన్నో చేయలేకపోయాను.  హైదరాబాదు వెళ్లినపుడల్లా విద్యానగర్లో వారింటికి వెళ్లేవాడిని. మనసులో సొదంతా ఈ ఫేస్బుక్కు అనే సంతలో ఉంచుతున్నాను. నా ఫీలింగ్స్ కోసం రేపటి నుంచి ఆయన కథలు నా బ్లాగులో ఉంచుతున్నాను. ఈలంకెను పూర్తిగా సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి gotoపై క్లిక్ చేయండి.  http://kathanilayam.com/story/19200

 

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

రజనీకాంత్ గారి కోసం

23 గురువారం జూన్ 2016

Posted by వివిన మూర్తి in వివిన కబుర్లు, వివిన రచనలు

≈ వ్యాఖ్యానించండి

ఇటీవల కలిసినపుడు నా వ్యక్తిగతమిత్రులు రజనీకాంత్ గారు వెల్చేరు నారాయణరావు గారి కన్యాశుల్కం నాటకం ఆంగ్లానువాదానికి ముందుమాటపై నేను మిసిమి పత్రికలో రాసిన వ్యాసం ప్రసక్తి వచ్చింది. దానిని తను చూడలేదనీ పంపమనీ వారు అన్నారు. ఇది జరిగి చాలాకాలం అయింది. నిరాసక్తత, వయసుపోరు( మా రాయుడుగారి మాట అంటే ముదిమి లక్షణాలు) వల్ల వారికి పంపలేకపోయాను. ఈరోజు బొంబేలో ఉండి ఏదో రాసుకుంటుంటే అకస్మాత్తుగా గుర్తువచ్చింది. వారికి పంపేటపుడు చాలాకాలమయింది గదా బ్లాగులో పెడితే అనిపించింది. చివరికి మనసు కూడదీసుకుని ఆపని చేస్తున్నాను. రజనీకాంత్ గారితో బాటు ఆసక్తిగలవారందరి కోసం ఈ నా వ్యాసం..

ఒక చిన్ని మనవి. చర్చ సాగించటానికి విషయ పరిజ్ఞానంతో బాటు సహనం, పరస్పర గౌరవం, అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పటం తప్పనిసరిగా ఉండాలి. గెలవాలన్న తొందరలో ఎదుటివారి అభిప్రాయలకు- చర్చాంశానికి బాహిరమైన దోషారోపక కంఠస్వరంతో- జవాబివ్వటం రెచ్చగొట్టటం తప్పనిసరిగా ఉండకూడదు. తెలుగు సమాజం యొక్క పరిస్థితిని ఫేస్బుక్కు వంటి కొందరికే చెందిన సోషల్ మీడియా పూర్తిగా ప్రతిఫలించదనే నేను ఆశపడుతున్నాను. ఈ మీడియా చర్చకి అవసరమైన వాతావరణం కల్పించలేదని గట్టిగా అనిపించింది.  మౌఖిక చర్చలో ఆవేశకావేషాలను నియంత్రించుకోటం- లిఖితరూపంలోని చర్చలోకన్న- ఎక్కువ కష్టమనే నా అంచనా ఈ సోషల్ మీడియా చర్చలను చూసాక తప్పని తేలింది.  వెల్చేరు వారి ముందుమాటపై నాయీ వ్యాసం నా సాధారణ రాతలకూ అభిప్రాయాలకూ పూర్తిగా భిన్న మైనది. ఆలోచనాదోషాలు చూపే ధోరణికీ నేను ఇతరులకన్న అధికుడననే అహానికీ మధ్య దగ్గర సంబంధం ఉంది. ఎత్తిచూపవలసిన పరిస్థితులు ఉంటాయి. కాని నేను మాత్రం ఆపని ఎన్నడూ స్వీకరించలేదు. ఈ ఒక్క విషయంలో నేను నాకు తప్పదనిపించి ఈ వ్యాసం రాయటం, ప్రచురించటం కూడా చేసాను. ఇది వెల్చేరు వారితో చర్చను ఆశించి ఉద్దేశించి రాయలేదు. ఆ వ్యాసం చదివే పాఠకులకి నా అభిప్రాయం చెప్పే స్వరంతో రాసాను. నా మనవి ఏంటంటే లిఖిత చర్చలలో అది పదిమందిమధ్య జరిగేటపుడు ఆ చర్చలకు సామాజిక సద్వినియోగం ఉండాలంటే స్వయం నియంత్రణ, విషయస్పష్టత కోసం ప్రయత్న ం, మన జవాబు ఎవరికోసం ఉద్దేశించబడిందన్న ఎఱుక ఆ చర్చలో పాల్గొనే వారికి ఉండాలి. లేకపోతే తెచ్చుకోవాలి. సమాజం అస్తవ్యస్త పరిస్థితిలో ఉన్నపుడే చర్చలు కావాలి. యుద్దరంగంలో ఉన్నపుడు చర్యలే కాని చర్చలు ఉండవన్నదీ వాస్తవమే. కాని ఇపుడున్నది యుద్దరంగం కాదు. యుద్దరంగం అన్న ఉద్రేకం కలిగించే బైట పరిస్థితులే ఉన్నాయి. అరిచి, వివాదాస్పద వ్యాఖ్యానాలతో రాత్రికి రాత్రి వీరులయిపోవాలనే లక్ష్యంతో రాసే, మాట్లాడే వారు ప్రముఖంగా కనిపించటం ఉంది. ఆ ధోరణి సరైనది కాదనిపించే వారు పూనుకుని మాటలాడవలసిన సమయం వచ్చింది. కనక సామాజిక బాధ్యత, సత్యపట్ల గౌరవం అనేవి మాటలాడేవారికి ఉన్నపుడే ప్రయోజనకరమైన చర్చలు జరుగుతాయి. ఈ మనవిలో నా మాటలను నేను ఈ వ్యాసంలో ఎంతవరకూ పాటించానన్నది పాటించగలిగానన్నదీ విజ్ఞులు గమనించగలరు.

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

అస్పృశ్యుల దేవాలయ ప్రవేశం

09 బుధవారం మార్చి 2016

Posted by వివిన మూర్తి in పాత పత్రికలు, వివిన కబుర్లు, శ్రీపాద

≈ వ్యాఖ్యానించండి

గాంధీగారి కాంగ్రెస్సు స్వతంత్రానికి ముందు ప్రచారం చేసిన కార్యక్రమాలలో- అస్పృశ్యుల దేవాలయ ప్రవేశం- ఒకటి. అంతకుముందే గురజాడ, బంకుపల్లి మల్లయ్యశాస్త్రి వంటి ఇంకా ఎందరో సంస్కరణ వాదులు మానవతా దృక్పధంతో అస్వృసేయ సమస్యపట్ల స్వందించారు. ఇంకా వెనక్కి వెళ్తే రామానుజుడూ, వీరశైవులూ ఈ అమానవీయ కట్టుబాట్లపై స్పందించారు. ఉద్యమాలు నడిపారు. గాంధి గారి -అస్పృశ్యుల దేవాలయ ప్రవేశం పుట్టుక, పరిణామం పరిశీలించగలవారికి దానిలో ఉండే రాజకీయాలు కూడా అందుతాయి.. 75 ఏళ్ల క్రితం దానిపై శ్రీపాద వేసిన ప్రశ్నలు- స్వతంత్రోద్యమం ఉరవడిలో, కాంగ్రెస్సు ప్రచారంలో- ఒక పక్కకు ఉండిపోయాయి. ఈనాడు మతం పేరుపెట్టుకున్న రాజకీయపక్షం పాలనలో ఉన్నాం మనం. నిజంగా వారికి మతం కావాలో, పాలనాధికారం కావాలో, అందులో దేనికోసం ఏదికావాలో తెలీని స్థితిలో ఆలోచనాపరులున్నారు. మతాన్ని ఒకలా వాడుకున్న గాంధి కాంగ్రెస్సు ఈనాడున్న కాంగ్రెస్సూ ఒకటేనా? ఆనాటి హిందూ మహాసభ ఈనాటి భాజపా ఒకటేనా? ఆనాడు ఒక నిజాయితీగల ఆలోచనాపరుడు వేసిన ప్రశ్నలు ఎలా మరుగున పడిపోయాయో ఈనాడూ వర్తమాన సంబంధిత ప్రశ్నలూ ప్రశ్నలూ మరుగున పడిపోతున్నాయా? ఈ ప్రశ్నలతో ఈవ్యాసం చదవండి.. నేడు వివేచన ఆవశ్యకతని గుర్తించండి. అందుకు ఈ ప్రశ్నలు – ఇలాంటి ప్రశ్నలు వెయ్యగల సత్తా కోసం- ఆలోచించండని కోరుతూ..Prabuddha Andhra_1939_08_దేవాలయప్రవేశం

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

అస్పృశ్యత – ప్రబుద్ధాంధ్ర జూన్ 1934

04 గురువారం ఫిబ్ర 2016

Posted by వివిన మూర్తి in ఇతరుల వ్యాసాలు, పాత పత్రికలు, వివిన కబుర్లు, శ్రీపాద

≈ వ్యాఖ్యానించండి

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు ప్రబుద్ధాంధ్ర పత్రిక నడిపారని చాలా మందికి తెలుసు. ఆ పత్రిక 1934 జూన్ సంచికలో వచ్చిన ఈ రచనని ఈరోజు టపాలో అందిస్తున్నాను. రచయిత భువనగిరి లక్ష్మీకాంతమ్మ గారు. 71 సంవత్సరాల నాటి ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. ముఖ్యంగా పల్లెటూళ్లలో మార్పు వచ్చింది. ఈమార్పు ఆశించినంత వచ్చిందా అన్నది వేరే చర్చ. పట్నాలలో కొత్తతరహా ప్రచ్ఛన్న అస్పృశ్యత ఫలితాలు నేడు మనం అనుభవిస్తున్నాం. దీనికి మన కుల నాయకుల రాజకీయాలెంత కారణమో, మన రాజకీయనాయకుల కుల సమీకరణాలు ఎంత కారణమో తేల్చుకోవలసిన బాధ్యత ఈ తరంమీద ఉంది. సాంఘిక సంస్కారావశ్యకతని పూర్తిగా వదిలేసి, భౌతికాభివృద్ది ఆశలను కేంద్రం చేసుకున్న రాజకీయవ్యాపారుల దండోరాలో మన జాతి నాయకుల లేమితో మనం ఇలావున్నాం. కొంతైనా బాధ్యత వహించవలసిన సాహిత్యం కొత్త వస్తువులకోసం కృత్రిమంగా పుట్టించబడిన పోటీలో వ్యక్తి సంస్కారం కోసం అలమటించటం మానేసింది. కృతక స్పందనలతో, పరుషపదాలతో, ఆక్షేపణలతో ఎదిరిని రెచ్చగొట్టే సాహిత్యం వ్యక్తి సంస్కారానికి, వివేచనకీ దోహదం చెయ్యలేదు. 71 ఏళ్ల నాటి ఈ రచన చదివినపుడు మన సమాజం, సాహిత్యం రావలసిన మార్పులను త్వరితం చెయ్యటానికి బదులు తప్పుదోవ పట్టించాయని లేదా పట్టించుకోటం లేదనీ అనిపించింది. లేకపోతే రోహిత్ వేముల హత్య- ప్రతి ఆత్మహత్య వెనకా కనీకనిపించని సామాజిక కారణం ఉంటుందన్నది వాస్తవం- జరిగేదా? ఈ లంకెలో ఈ రచన తీసుకోండి. PRABUDDHA_ANDHRA_1934_06_అస్పృశ్యత

 

 

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

అస్పృశ్యత – ప్రబుద్ధాంధ్ర జూన్ 1934

04 గురువారం ఫిబ్ర 2016

Posted by వివిన మూర్తి in ఇతరుల వ్యాసాలు, పాత పత్రికలు, వివిన కబుర్లు, శ్రీపాద

≈ 1 వ్యాఖ్య

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు ప్రబుద్ధాంధ్ర పత్రిక నడిపారని చాలా మందికి తెలుసు. ఆ పత్రిక 1934 జూన్ సంచికలో వచ్చిన ఈ రచనని ఈరోజు టపాలో అందిస్తున్నాను. రచయిత భువనగిరి లక్ష్మీకాంతమ్మ గారు. 71 సంవత్సరాల నాటి ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. ముఖ్యంగా పల్లెటూళ్లలో మార్పు వచ్చింది. ఈమార్పు ఆశించినంత వచ్చిందా అన్నది వేరే చర్చ. పట్నాలలో కొత్తతరహా ప్రచ్ఛన్న అస్పృశ్యత ఫలితాలు నేడు మనం అనుభవిస్తున్నాం. దీనికి మన కుల నాయకుల రాజకీయాలెంత కారణమో, మన రాజకీయనాయకుల కుల సమీకరణాలు ఎంత కారణమో తేల్చుకోవలసిన బాధ్యత ఈ తరంమీద ఉంది. సాంఘిక సంస్కారావశ్యకతని పూర్తిగా వదిలేసి, భౌతికాభివృద్ది ఆశలను కేంద్రం చేసుకున్న రాజకీయవ్యాపారుల దండోరాలో మన జాతి నాయకుల లేమితో మనం ఇలావున్నాం. కొంతైనా బాధ్యత వహించవలసిన సాహిత్యం కొత్త వస్తువులకోసం కృత్రిమంగా పుట్టించబడిన పోటీలో వ్యక్తి సంస్కారం కోసం అలమటించటం మానేసింది. కృతక స్పందనలతో, పరుషపదాలతో, ఆక్షేపణలతో ఎదిరిని రెచ్చగొట్టే సాహిత్యం వ్యక్తి సంస్కారానికి, వివేచనకీ దోహదం చెయ్యలేదు. 71 ఏళ్ల నాటి ఈ రచన చదివినపుడు మన సమాజం, సాహిత్యం రావలసిన మార్పులను త్వరితం చెయ్యటానికి బదులు తప్పుదోవ పట్టించాయని లేదా పట్టించుకోటం లేదనీ అనిపించింది. లేకపోతే రోహిత్ వేముల హత్య- ప్రతి ఆత్మహత్య వెనకా కనీకనిపించని సామాజిక కారణం ఉంటుందన్నది వాస్తవం- జరిగేదా? ఈ లంకెలో ఈ రచన తీసుకోండి. PRABUDDHA_ANDHRA_1934_06_అస్పృశ్యత

 

 

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

మహమ్మద్ ఖాసింఖాన్ – పురిపండా అప్పలస్వామి

12 శుక్రవారం జూన్ 2015

Posted by వివిన మూర్తి in పాత పత్రికలు, వివిన కబుర్లు

≈ 3 వ్యాఖ్యలు

ట్యాగులు

పురిపండా అప్పలస్వామి, మహమ్మద్ ఖాసింఖాన్

నాకు బాగా పరిచయమైన మొదటి సాహిత్యవేత్త పురిపండా అప్పలస్వామి గారు. నా వెనకబెంచీ మనస్తత్వం వల్ల ఎవరితోనూ చొరవగా పరిచయం చేసుకునే అలవాటు లేధు. ఎవరికి ఏం అవసరం వచ్చినా నేను చెయ్యగలిగింది చేసే గుణం వల్ల ఆయనకి చేరువయాను. తూమాటి దోణప్ప గారి హరికథా సర్వస్వము(అని గుర్తు) వ్రాతప్రతి చదివి వినిపించటానికి ప్రతిరోజూ పురిపండా ఇంటికి వెళ్లేవాడిని. ఆయన నాగురించి అడిగినపుడు నా పద్యకవిత్వం, నా కావ్యం కపోతసందేశం వారికి చూపించాను. వస్తువు అభ్యుదయానికి చెందినపుడు దానికి పద్యకవిత్వం నప్పదని ఆయన చెప్పారు. వస్తువుకి తగిన వాహనం ఉండాలన్నారు. వారి హిందీ అనువాదం ఏదో రామలక్ష్మి గారికి కానుకగా ఇచ్చిన గుర్తు.

మా కారాయజ్ఞం ప్రచరించిన తొలి పుస్తకం కథానికారచన. దీనిని రాసినవారు మహమ్మద్ ఖాసింఖాన్. వీరి వ్యాసాలు కొన్ని ఈ ప్రచురణానంతరం నాకు ఎదురయాయి. వీరి ఫొటో కోసం ప్రయత్నించినా లభించలేదు. వీరు రాసిన వ్యాసం కవితావిమర్శనము 1930 సమదర్శని ఉగాది సంచికలో వచ్చింది. దీనిలో తెలుగు కవిత్వ స్వర్ణయుగం ఇంకా ఆరంభం కాలేదంటారు ఖాసింఖాన్. అప్పటికి శ్రీశ్రీ మహాప్రస్థానం కవిత్వం రాలేదు. భావకవిత్వంతో కొంచెం స్వర్ణయుగద్వారాలు తెరవబడినట్లు ఖాన్ రాస్తారు. కవి వ్యక్తిత్వం, కవిత్వంగా విభజించి ఆనాటి కవిత్వ స్థితిని మొత్తంగా చూడటానికి చేసిన ప్రయత్నం నన్ను ఆకట్టుకుంది.

తెలుగు ఆధునిక కవిత్వం తీరుతెన్నుల గురించి అంతగా తెలియని నేను అనరాదేమో గాని నాకు తెలిసి శ్రీశ్రీ మహాప్రస్థానం, శైశవగీతి, కవితాఓకవితా, నగ్నముని కొయ్యగుర్రం తప్ప గొప్ప దీర్ఘకావ్యాలు మనకు తక్కువ.

దీర్ఘకావ్యములు రచింపకుండుట కవికొక లోపము. స్వీయప్రవృత్తిని చిత్రించుట కన్న సామాన్యమానవప్రవృత్తి చిత్రించుటయందే కవి తన కవితాశక్తులను చూపఁగలడు.

ఈ ఖాసింఖాన్  గారి అభిప్రాయం గురించి కవులు ఆలోచించవలసిందిగా వినతి.

ఇందులో పురిపండావారి గురించి చిట్టచివరి పేరాలో రాసిన వాక్యాలు నాకు తెలిసిన స్వచ్ఛమైన పురిపండా వ్యక్తిత్వం గుర్తుచేసింది. కవులూ, విమర్శకులూ తప్పక చదవాల్సిన అంశాలు ఈ వ్యాసంలో ఉన్నాయి. చదువుతారన్న ఆశతో ఈ వ్యాసం.. SAMADARSHINI_1930_01_01_Volume_No_Issue_No_3

 

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

చిత్రకవిత్వము – ఈతరం

01 సోమవారం జూన్ 2015

Posted by వివిన మూర్తి in పాత పత్రికలు, వివిన కబుర్లు

≈ వ్యాఖ్యానించండి

ట్యాగులు

చిత్ర కవిత్వము

ఈతరానికి ఇప్పుడు నేను అందిస్తున్న వ్యాసం ఎంతవరకూ ఆసక్తిగా ఉంటుందో తెలీదు. చనిపోతున్న అనేక కళలలో పద్య రచనను చేర్చటానికి వీలులేదు. పద్య రచన వేరు పద్య కవిత్వం వేరు. పద్య కవిత్వం చాలావరకూ కనుమరుగైనా, రచన భిన్న రూపాలలో కొనసాగుతూనే ఉంది. ఈనా అభిప్రాయం పైపై పరిశీలన వల్ల కలిగినదే. దీనికి అష్టావధానాలు, శతావధానాల రూపంలో ఇంకా జనాదరణ ఉంది. ఇది సంస్కృతికి మూలరూపంగా ఇంకా కొందరు గౌరవించటం, ధనం ఖర్చుపెట్టటం, కొందరైనా విస్మయంతో ఆనందపడటం ఉంది.

ఇదంతా పక్కన పెట్టి,

అనేక పూర్వపు కళలలో దీనిని ఒకదానినిగా నేను భావిస్తాను. ఇలాంటి వాటితో మన సమీప పూర్వీకుల సృజనశక్తి క్షీణదశకు చేరుకుందని అనేకమంది ఆధునికులు తేల్చేసారు. మన శిష్టుల సృజనశక్తి భారత ఇతిహాసాన్ని అనువాదించటంలో ప్రాంతీయతను మిళితం చెయ్యటంతోనే ఆరంభమయింది. ఇది తిక్కన నాటికి అభివృద్ధి చెందింది. శ్రీనాధుడు, పోతనల నాటికి స్వతంత్ర విస్తరణలు ఆరంభమయాయి. ప్రబంధయుగానికి పురాణాలలో, ఇతిహాసాలలోంచి మూలకథని తీసుకుని విస్తరించటం దాని పరిణామమే. ఆ తర్వాత కాలానికి పింగళితో మొదలైన స్వతంత్ర కల్పన కొనసాగింపుగా ఉండకపోటంతో అనేకులు దానిని క్షీణదశగా భావించారు. ఈ పరిణామక్రమంలో ఈ దశలో వచ్చినవి ద్వ్యర్ధి, త్ర్యర్థి కావ్యాలు. అలాగే చిత్ర, గర్భ కవిత్వాలు. ప్రాంతీయత మరింత హెచ్చింది.

ఇలా

సృజన శక్తి తీసుకున్న రూపాలలోని చిత్ర, గర్భ కవిత్వాలను నేను ఒక మరుగున పడుతున్న  కళగా గుర్తిస్తాను. ఈరోజు అందిస్తున్న వ్యాసం వాటిని గురించి ఈనాటి తరానికి ఉపయోగం ఉండదని తెలిసినా, భద్రపరచదగిన ఒక కళారూపంగా చూడవలసిందిగా, ఆనందించవలసిందిగా నా వినతి. ఇది ఆంధ్రభాషావిలాసిని పత్రికలో 1926 జనవరి సంచికలో వచ్చింది.

ANDHRA_BHASHA_VILASINI_1926_01_chitra kavitwamu

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

మా ఉదయపు నడక- శేషప్రశ్న

03 శుక్రవారం ఏప్రి 2015

Posted by వివిన మూర్తి in వివిన కబుర్లు

≈ వ్యాఖ్యానించండి

మా ఉదయపు నడక- శేషప్రశ్న

రామలక్ష్మి గారు నన్ను ఉదయమే నడకకి తీసుకుపోతారని మా మిత్రబృందం 20 ఏళ్లుగా నమ్ముతోంది. నేను వారి నమ్మకాన్ని ఖండించను. ఆమాటకి వస్తే నమ్మకాల స్థాయిలో ఉన్నవాటిని ఖండించకపోటమే మంచిది. అలా తీసుకుపోయిన రామలక్ష్మిగారు ప్రశ్నలు వేస్తారు. నేను జవాబులనుకునేవి చెప్పటానికి ప్రయత్నిస్తాను.అపుడపుడు నా మెదడులో ఉన్నది కూడా పంచుకుంటాను. మొత్తంమీద మా మాటలలో సాంసారిక, వ్యక్తిగత అంశాలు 5 శాతం మించవు.  సాహిత్యం, సామాజికం నా మటుకు వేరు కావు. పోతే కల్పనా సాహిత్యం మీద ఆధారపడి మాటలాడుకుంటే దానిని సాహిత్యంగా గుర్తిస్తాం. ఇతర పుస్తకాల గురించి మాటాడుకుంటున్నపుడు దానిని సామాజిక అంశం అంటాం. ఇలా మేం మాటలాడుకునే వాటిలో కొన్నింటిని అపుడపుడు నలుగురితో పంచుకోవాలనిపిస్తుంది. కొద్దిరోజులుగా మా నడక కబుర్లకి ఇరుసు శరత్. ఓరోజు ప్రసాద్ గృహదహనం గురించి ఎత్తటంతో శరత్ పునఃప్రవేశం జరిగింది. మాతరం మా ముందు తరం శరత్ చదవటంతోనే ప్రపంచం గురించి ఆలోచనలలో పడ్డాం. తెలిసీ తెలియనిదశలో శరత్ తెలుగు వాడే అనుకునేవాళ్లం. నేనూ, నామిత్రుడూ బాల్య చేష్టలరాతలలో కలిసి రాసిన నవలల్లో పాదధూళి దిట్టంగానే ఉండేది. ఏభై ఏళ్ల క్రితం చదివిన శరత్ శేషప్రశ్న కమల నా మెదడు మీద శాశ్వతంగా ఉండిపోయింది. కాకపోతే డోస్టోవిస్కీ నేరమూ శిక్షా నన్ను ప్రభావితం చేసిన లేక మార్చిన లేక దిద్దిన పుస్తకం. ఆ రెంటికీ మధ్య నేను చదవటంలో నాలుగైదు ఏళ్ల ఎడం ఉంది. శేషప్రశ్న, భారతి, శ్రీకాంత్ నేను బాగా ఇష్టపడే శరత్ రచనలని చెపుతుంటాను. గృహదహనంతో ఆరంభమైన రామం పఠనం కారామాస్టారి మీదకి పాకింది. ఆయనకి పుస్తక పఠనం ఏమిటో చెప్పాలంటే అదో పేద్ద కథ. దడదడా ఆయన రోజుకో నాలుగు నవలల చొప్పున అక్షరం పొల్లుపోకుండా చదివేస్తూ విప్రదాసులో ఉండగా మేం ఆయననీ, శ్రీకాకుళాన్నీ వదిలి బెంగళూరు వచ్చిసాం. మరో మూడునెలలు ఇక్కడే. రామం గృహదహనం నాకు అంటుకుంది. ఓ పక్క వెబర్, మరోపక్క నున్నా నరేష్ దిద్దూబాట్లూ, తెరానామ్ సహారా ఇంకోపక్క కథానిలయం, వేరేపక్క తెలుగు పుస్తక ప్రచురణ రంగం(జయంతి) ఇలా దశకంఠుడిలా నేను. చివరికి నా దహనం పూర్తయింది. కూతురి పెళ్లి చేసుకుంటున్న ప్రసాద్ ని పట్టుకొచ్చి గృహదహనం గురించి ఆయనేంటనుకుంటున్నారో చెప్పమని పట్టాం. ఈ స్థితిలో శేషప్రశ్న మింగేసింది రామంగారు. దాని గురించి నాచేత మాటాడించాలని ఆవిడ పట్టు. ఆరంభించాను. ఒకటే చదవటం అన్న మంచిబుద్ధి లేదాయె. కాని ఈ రోజు నడకలో నేను ఏకబిగిన చదివానని గుర్తు చేసి ఇప్పుడుచెప్పమంది రామంగారు.  చేప్పాలనే ఉంది. అది ఎంతసేపు అఁటిపెట్టుకునుంటుంది.. చూదాం.. రేపు దానిగురించి బుద్ది సహకరిస్తే..

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

atreya – poems

24 మంగళవారం ఫిబ్ర 2015

Posted by వివిన మూర్తి in పాత పత్రికలు, వివిన కబుర్లు

≈ వ్యాఖ్యానించండి

ట్యాగులు

ఆత్రేయ

ఆత్రేయ సినిమా పాటలు అందరికీ తెలుసు. ఆయన నాటకాల ప్రసిధ్ది సాహిత్యజీవులలో చాలామందికి తెలుసు. ఈ పద్యాలను నార్ల చిరంజీవి గారు ఆత్రేయ డైరీల నుంచి ఈ పద్యాలను సేకరించి ప్రచురించానని స్రవంతి 1967 జూలై సంచిక లో తెలియజేసారు. ఈ పద్యాలలో గాలిబ్ గీతాల ఛాయలు కనుపిస్తున్నాయి. దాశరధి గారు అనువదించిన గాలిబ్ గీతాలు తొలి ప్రచురణ మార్చి 1961లో జరిగింది. వాటిని చదవి నేను ఇలాంటి పద్యాలను రాస్తూ ఉండేవాడిని. కాని ఛందోబద్ధ పద్యాలు(వృత్తాలు) రాసినపుడు కలిగే ఆనందం భిన్నంగా ఉండేది. వీటిలో భావం మనసుకి దగ్గరగా అనిపించేది. పురుషుని ప్రేమ – ఒక స్త్రీ పై పురుషుని ప్రత్యేక ఆసక్తి (సులువుగా చెప్పాలంటే)- తనకు మాత్రమే ఆమె పరిమితం కావాలన్న సాంప్రదాయక( నా అప్పటి అవగాహన ప్రకారం) భావనకి మించిందిగా అనిపించేది. అది భావకవిత్వ ప్రభావంలో ఉన్న నాకు దానికన్న భిన్నంగా, మిన్నగా అనిపించింది. పురుషుని  భావుక స్వేచ్చ భావకవిత్వంలో కనిపిస్తే (భావుకజీవి మానస విభావరిలో యొక వెల్గు రేఖ ఈ భావనలోని ప్రేమ .. అని రాసాను ఒకనాడు ఓ కావ్యంలో. దాని వెనకనే దానికి భగవంతునిపై భక్తికీ సంబంధం గురించి,అది మనిషికి ఇవ్వగల ఆత్మవిశ్వాసం, తెగింపూ గురించి తార్కిక యోచనా) గాలిబ్ లో స్త్రీకి కావలసిన స్వేచ్ఛపై గౌరవం కనిపించేది. భావకవిత్వంలో స్వేచ్ఛ కనిపించితే గాలిబ్ లో అంతకు మించిన తాత్వికత ఏదో కనిపించేది. 19వ శతాబ్ధపు  రొమాంటిక్ కవుల ప్రభావం భావకవుల మీద ఉండటం గురించి విన్నాను గాని, గాలిబ్ ప్రభావం గురించి వినలేదు. తెలిసిన వారు చెపితే తెలుసుకోవాలని ఉంది. ఇవన్నీ ఆరుద్ర గారి ఈ నవముక్తకాలు కంట పడినపుడు మనసులో కదిలేయి. ఆసక్తి గలవారి కోసం అందిస్తున్నాను.Sravanti_1965_07_00_Volume No_12_ATREYA

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

discussion on nalla miriyam chettu – a telugu novel

14 శుక్రవారం మార్చి 2014

Posted by వివిన మూర్తి in వివిన కబుర్లు

≈ 3 వ్యాఖ్యలు

ట్యాగులు

dalit issue, v. chandrasekhar rao

జనవరి నెలలో చర్చ సభ్యులు చర్చించిన నవల నల్లమిరియం చెట్టు. ఆ చర్చ వివరాలు కొంత ఆలశ్యంగానైనా అందజేస్తున్నాను. ఈ లంకెలో చూడగలరు.nalla miriyam

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…
← Older posts

ఇటీవలి టపాలు

  • కావాలి వేల కలాల నిఘా
  • ప్రాచీన హిందూగ్రామ పరిపాలనము
  • గిరీశం, ఎంకి, కాంతం, పార్వతీశం
  • ప్రాశ్చాత్య జ్ఞానాన్ని భద్రపరచిన ఇస్లాం
  • అచ్చుబాటు కాని చదువు

ఇటీవలి వ్యాఖ్యలు

అచ్చుబాటు కాని చదువు పై వివిన మూర్తి
అచ్చుబాటు కాని చదువు పై jvpssoma
కట్టమంచి రామలింగారెడ్డి గారి న… పై jvpssoma
తప్పెవరిది? శిక్ష ఎన్నెమ్మకా? పై వివిన మూర్తి
తప్పెవరిది? శిక్ష ఎన్నెమ్మకా? పై jvpssoma

భాండాగారం

  • జూలై 2022
  • జూన్ 2022
  • మే 2022
  • ఏప్రిల్ 2022
  • మార్చి 2022
  • ఆగస్ట్ 2021
  • జూలై 2021
  • ఆగస్ట్ 2020
  • జూలై 2020
  • జూన్ 2020
  • మే 2020
  • ఫిబ్రవరి 2020
  • మార్చి 2019
  • డిసెంబర్ 2018
  • ఆగస్ట్ 2018
  • జూలై 2018
  • మే 2018
  • మార్చి 2018
  • ఆగస్ట్ 2017
  • మార్చి 2017
  • జూన్ 2016
  • మార్చి 2016
  • ఫిబ్రవరి 2016
  • డిసెంబర్ 2015
  • అక్టోబర్ 2015
  • జూలై 2015
  • జూన్ 2015
  • మే 2015
  • ఏప్రిల్ 2015
  • మార్చి 2015
  • ఫిబ్రవరి 2015
  • జనవరి 2015
  • డిసెంబర్ 2014
  • నవంబర్ 2014
  • సెప్టెంబర్ 2014
  • ఆగస్ట్ 2014
  • జూలై 2014
  • జూన్ 2014
  • ఏప్రిల్ 2014
  • మార్చి 2014
  • ఫిబ్రవరి 2014
  • జనవరి 2014
  • డిసెంబర్ 2013
  • నవంబర్ 2013
  • అక్టోబర్ 2013
  • సెప్టెంబర్ 2013
  • ఆగస్ట్ 2013
  • జూలై 2013
  • జూన్ 2013
  • మే 2013

వర్గాలు

  • ఇతరుల కథలు
  • ఇతరుల వ్యాసాలు
  • కాళీపట్నం రామారావు
  • పాత పత్రికలు
  • వి రామలక్ష్మి రచనలు
  • వివిన కబుర్లు
  • వివిన రచనలు
  • శ్రీపాద
  • సినిమా నటులు
  • Uncategorized

మెటా

  • నమోదవ్వండి
  • లోనికి ప్రవేశించండి
  • టపాల ఫీడు
  • వ్యాఖ్యల ఫీడు
  • WordPress.com

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • అనుసరించు అనుసరిస్తున్నారు
    • వివిన మూర్తి వెదుకులాట
    • మరో 36గురు చందాదార్లతో చేరండి
    • Already have a WordPress.com account? Log in now.
    • వివిన మూర్తి వెదుకులాట
    • అనుకూలపరచు
    • అనుసరించు అనుసరిస్తున్నారు
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు
%d bloggers like this: